మన్యం న్యూస్, అశ్వాపురం. నవంబర్ 16:
కార్గో సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన డిపో మేనేజర్.
అశ్వాపురం, మండలంలోని మొండికుంట గ్రామంలో మణుగూరు ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కార్గో పార్సిల్ సర్వీస్ సెంటర్ ను మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొండికుంట గ్రామమలొ నిధానపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా కార్గో సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని మొండికుంట గ్రామ ప్రజలు కార్గో సర్వీస్ ను ఉపయోగించుకోవాలంటే అశ్వా పురం, మణుగూరు వంటి ప్రాంతాలకు వెళ్లేవారని, ఇకనుంచి అటువంటి ఇబ్బంది లేకుండా మొండికుంట గ్రామంలో కార్గో సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇక్కడి నుండి ఆర్టీసీ ద్వారా తెలుగు రాష్టలలో ఎక్కడికైనా పార్శిల్ పంపించుకోవచ్చని , మీ పార్శీలు సురక్షితంగా గమ్యానికి చేరుస్తుందని ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్యా శ్రీనివాస్, కలవల వెంకట్, కాసరబాధ రాములు, తదితరులు
Post A Comment: