విప్ రేగా కాంతారావు పినపాక ప్రజలకు వరం
*నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏజెన్సీలో ఇంత గొప్ప నాయకుడు చూడలేదు.
* కమిట్మెంట్ లీడర్ విప్ రేగా.
*అభివృద్ధి మాంత్రికుని తోనే నా జీవిత పయనం.
*జెడ్పీటీసీ గా మా కుటుంబానికి అవకాశం కల్పించిన రేగా కు రుణపడి ఉంటాం.
* మాజీ ఎంపీపీ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు.
మన్యం టీవి, పినపాక : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులుకురేగా కాంతారావుపినపాక ప్రజలకు దేవుడు ఇచ్చిన వరం అని మాజీ వైస్ ఎంపీపీ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు అన్నారు. ఆయన బుధవారం మన్యం టీవీ తో ముచ్చటించారు. ప్రతిక్షణం ప్రజాసేవకు తప్పించడం, అభివృద్ధి తోపాటు,ప్రజలకు అవసరమైన పనులు సాధించడం రేగా కే చెల్లుబాటుఅవుతుంది అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటికే పలువురు ఎ ఎమ్మెల్యేలను చూసినప్పటికీ, రేగా కాంతారావు లాంటి కమిట్మెంట్ ఎమ్మెల్యేను చూడలేదన్నారు. తన భార్య దాట్ల సుభద్రాదేవి వాసు బాబు జడ్పిటిసి గా అవకాశం ఇవ్వడం పట్ల విప్ రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే రేగా కాంతారావు అసెంబ్లీలో చర్చించడం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ముంపు గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయి అన్నారు. గోదావరి భీమవరం లిఫ్ట్ నిర్మాణ ప్రాధాన్యతను విప్ రేగా కాంతారావు వివరించగా వెంటనే స్పందించి లిఫ్ట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించడమే విప్ రేగా పనితనానికి నిదర్శనమన్నారు .టీ. కొత్తగూడెం ప్రాంతంలో గిరిజనుల పోడు భూముల అంశాన్ని రేగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని,అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పినపాక అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావు తోనే తన జీవిత రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని ఆయన ఘంటాపథంగా చెప్పారు.
Post A Comment: