మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ నందు నేతకాని సంఘం రాష్ర్ట నాయకులు గుమాసు లక్ష్మయ్య అధ్యక్షతన పినపాక మండల నేతకాని సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు జాడి లక్ష్మయ్య మాట్లాడుతూ పినపాక మండల నేతకాని సంఘం పదవీ కాలం ముగిసిందని ప్రకటించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు జిమ్మిడి శివశంకర్ , జాడి వెంకటేశ్వర్లు మరియు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పినపాక మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పినపాక మండల నేతకాని సంఘం అధ్యక్షుడుగా_ గుమాసు గోవర్ధన్, ఉపాధ్యక్షుడుగాబసారికారి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగాజాడి రాంబాబు, సహాయ కార్యదర్శిగాజాడి కిరణ్, కోశాధికారిగాగోగు వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శిగా_జిమ్మిడి వెంకటేశ్వర్లు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
తరువాత నూతన అధ్యక్షుడు గుమాసు గోవర్ధన్ మాట్లాడుతూ...తనపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పినపాక మండల నేతకానీలకు కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్ లో ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో నేతకానీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మరియు రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లి తద్వారా సమస్యల పరిస్కారమే ముఖ్య ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తానని అందుకు ప్రజలందరూ సహాయ_సహకారాలు అందించాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ అధ్యక్షుడు జాడి రాంబాబు, మాజీ ప్రధాన కార్యదర్శి గుమాసు శంకర్, వార్డ్ మెంబర్లు జిమ్మిడి సుమన్, జాడి చిట్టిబాబు, జాడి వెంకటేశ్వర్లు , జాడి శ్రీనివాస్, గుమాసు సుదర్శన్, గుమాసు సురేందర్, సల్లూరి శ్రీరాములు, దుర్గం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: