ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు విద్యుత్ పై క్షేత్రస్థాయిలో మెలకువలు
*దగ్గరుండి పర్యవేక్షించిన అధ్యాపకులు సతీష్ రెడ్డి
మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు స్థానిక మీ సబ్ స్టేషన్ నందు క్షేత్రస్థాయిలో మెలకువలను విద్యుత్ శాఖ ఏఈ రమేష్ బాబు, కళాశాల అధ్యాపకులు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ వర్క్ చేసి మెలకువలను తెలుసుకున్నారు. కరెంట్ లో వోల్టేజీ, ప్రమాదం జరిగినప్పుడు ఎలా నియంత్రించాలి అనే అంశాలపై విద్యార్థులకు ఏఈ క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి పేర్కొన్నారు
Post A Comment: