మన్యం న్యూస్, పినపాక:
పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రేగాకాంతారావుకు పినపాక మండల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం నాడు పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పినపాక మండలంలోని పెంటన్నగూడెం గ్రామం నుండి బిటిపిఎస్ వరకు 1.98 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణం, 60 లక్షల రూపాయల వ్యయంతో మల్లారం పంచాయతీలోని చిన రాజుపేట వద్ద వంతెన నిర్మాణము, త్వరలోనే పినపాక మండలంలో నిర్మించబోయే ఫైర్ స్టేషన్ నిర్మాణాలకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నిధులను కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత పినపాక నియోజకవర్గానికి తిరిగి వస్తున్న సందర్భంగా తల్లాడ నుండి 200 వాహనాలతో భారీ ర్యాలీగా భద్రాద్రి జిల్లాలోకి ఆహ్వానం ఉంటుందని, ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త తప్పక హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్, టిఆర్ఎస్ నాయకులు వాసు బాబు, బుల్లి బాబు, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: