మన్యం న్యూస్/వాజేడు: నవంబర్ 18:
విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ హరీష్ తన సిబ్బందితో కలిసి టేకులగూడెం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా, చెరుకూరు నుండి చత్తీస్గడ్ వైపు ఒక ప్రైవేట్ వాహనంను తనిఖీ చేశారు. అందులో నుండి ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగ్ తో పాటు దిగి అనుమానాస్పద స్తితిలో పారిపోవటానికి ప్రయత్నించగా, ఇంతలో ఎస్.ఐ తన సిబ్బందితో వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు వరుసగా ముద్దబోయిన రాజేష్, నీలంపల్లి గ్రామం, పలిమెల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కుంజా పాపారావు, బండారుగూడెం గ్రామం & మంగపేట మండలం, పొడియం రవి గుండాలపాడు గ్రామం, ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పినారు. వారి వద్ద ఉన్న బ్యాగ్ లో కొంత డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు అనుమానస్పదంగా కనిపించగా పేరూరు ఎస్.ఐ వెంటనే ఇద్దరు పంచులను పిలిపించి వారి సమక్షంలో పంచనామా నిర్వహించగా అందులో ముద్దబోయిన రాజేష్ అనే వ్యక్తి ఈ నవంబర్ 1వ తేది నాడు ధర్మారం గ్రామంలోని రైస్ మిల్ బజార్ లోని తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో అర్ధరాత్రి సమయంలో చొరబడి, డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు తెలిసింది.
అంతేకాకుండా తాను ఏటూర్ నాగారం సబ్ డివిజన్ పరిధిలో వాజేడు, పేరూరు, కన్నాయిగూడెం ఏరియా లలో చర్ల, దుమ్ముగూడెం ఏరియాలలో పలు రకాలుగా దొంగిలించిన సొమ్ము 9,83,375/- రూపాయలుగా ఎస్సై తిరుపతిరావు గుర్తించారు.
ఇట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ సంగ్రామ సింగ్ ఫాటిల్ అభినందించారు.
Post A Comment: