మన్యం న్యూస్, గుండాల , నవంబర్ 18 ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య లభిస్తుందని మండల నోడల్ ఆఫీసర్ కె. కిషన్ అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని కిష్టాపురం ప్రభుత్వ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారని గ్రామస్తులను వాకప్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యతను ఆయన పరిశీలించారు. ప్రణాళిక తో బోధన అభ్యసన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి రమేష్ , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజయ్య, ఉపాధ్యాయుడు సత్తులాల్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: