మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేట గ్రామం లో కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు గంగెర్ల శ్రీనివాస్ తండ్రి నర్సయ్య ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న రాజుపేట కాంగ్రెస్ నాయకులు దశదిన ఖర్చుల నిమిత్తం 4500 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ఒక కుటుంబం అటువంటి కుటుంబ సభ్యులకు ఆపద వస్తే ఆదుకోవటానికి మేము ఉన్నాం అంటూ పితృ వియోగం చెందిన గంగెర్ల శ్రీనివాస్ కు దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమం లో పొట్రూ సమ్మయ్య,తుమ్మల సుధాకర్ ముఖర్జీ,చందర్లపాటి శ్రీనివాస్, పళ్ళికొండ యాదగిరి గంగెర్ల రాజారత్నం, పయ్యావుల బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: