మన్యం న్యూస్, మంగపేట. నవంబర్ 18:
తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ పై కొంతమంది విష ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అటువంటి అసత్య ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి అని మండల ప్రధాన కార్యదర్శి, గుండేటి రాజుయాదవ్, జీవ వైవిద్య జిల్లా కార్యదర్శి శ్యాంబాబు , యూత్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గుమ్మల వీరస్వామి, యాసం హరీష్,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య అన్నారు.
శుక్రవారం విలేకరుల సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ
స్థాయిలేని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ లాంటి వ్యక్తులు కేవలం వారి కుటుంబ సభ్యులకు దళిత బందు కోసం
ఎమ్మెల్యే మెప్పుపొందడం కోసం విమర్శలు చేయడం సరైన చర్య కాదు అంటూ హితవు పలికారు.
ఈ కార్యక్రమం లో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, మండలం నాయకులు, జిల్లా నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: