- ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతం..
- ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలి.. జిల్లా వైద్య అధికారి డాక్టర్ దయానంద స్వామి..
మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం నవంబర్ 03::
ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దయానంద స్వామి సూచించారు. గురువారం మండల పరిధిలోని లక్ష్మీ కాలనీ గ్రామం ఉంజుపల్లి ఆశ్రమ పాఠశాల ఆవరణలో భద్రాచలం ఐటిడిఏ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ దయానంద స్వామి మాట్లాడుతూ వైద్య శిబిరంలో 500 మంది ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందినట్లు వీరిలో 105 మంది గర్భిణీలకు స్కానింగ్ నిర్వహించినట్లు 38 మంది కంటి పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ అవసరమైన 12 మందిని ఖమ్మం ఆసుపత్రికి రిపేరు చేసినట్టు తెలిపారు అలానే 45 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు ఈ వైద్య శిబిరాన్ని ఎంపీపీ కోదండ రామయ్య జెడ్పిటిసి సభ్యురాలు ఇర్పా శాంత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునురావు లక్ష్మీ కాలనీ సర్పంచ్ బాలకృష్ణ ఎంపీటీసీ మడకం పద్మజ ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో కొత్తగూడెం మెడికల్ కాలేజీకి చెందిన జనరల్ డాక్టర్ సాయికిరణ్ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీలత డాక్టర్ విజయకుమార్ చిన్న పిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ వినయ్ కుమార్ చింత సత్యనారాయణ మండలానికి చెందిన ఆశ వర్కర్లు వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: