మన్యం న్యూస్, చండ్రుగొండ నవంబర్ 2 : మండల పరిధిలో ని తిప్పనపల్లి గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఎంపికలో కొంతమంది లబ్ధిదారులు అనర్హురులని గ్రామపంచాయితీ 4వవార్డు సభ్యురాలు దుంప సాయమ్మ బుధవారం తహసిల్దార్ వర్స రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తిప్పనపల్లి డబుల్ బెడ్ రూమ్ ఎంపికలో దుంప నాగరాజు, దుంప ఆంజనేయులు, కురం గంగమ్మ, ధరావత్ శ్రీదివ్య, ధారావత్ సంధ్య, ధారావత్ మని,గుగ్గులోత్ మంగమ్మ, వాక్కుడోత్ సరోజ, నునావత్ లక్ష్మి, గుగ్గులోత్ ఉమా, తేజవత్ వీరమ్మ, వీరు అనర్హురులని వీళ్లకు ఒకే కుటుంబంలో ఇద్దరు, మిగతా వాళ్లకు భూములు, ఉద్యోగాలు ఉన్నాయని ఆమె తెలిపారు.తక్షణమే అనర్హులుగా ప్రకటించి, అర్హులైనవాసం గంగాభవాని, సులోచన,రాణి,రమాదేవి,రమణ, యశోద,నాగేశ్వర, వెంకట నరసమ్మ, నిరుపేద ఎస్టి నాయక పోడు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ఇళ్ళు కేటాయించాలని తాసిల్దారుని కోరారు.
Navigation
Post A Comment: