*రహదారి నియమాలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
*ఆర్ అండ్ బి నిర్ణయించిన సరిహద్దులలోనే దుకాణాలు ఉండాలి
*మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు
మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి నియమాల ప్రకారం దుకాణాలు నెలకొని ఉన్న ప్రదేశాలలో కొలతలు తీసుకున్నారు. ఆర్ అండ్ బి రహదారి పక్కన దుకాణాలు నిర్మించి ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఆర్ అండ్ బి డి ఈ హరిలాల్ తో కలిసి బయ్యారం క్రాస్ రోడ్ లో రోడ్డును పరిశీలించారు. రోడ్డు మధ్య నుండి 55 అడుగులు టేపుతో కొలిచి అంతవరకు ఎవరైనా షాపులు నిర్మిస్తే షాపులను ధ్వంసం చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం, వాహనాలు స్థలం లేక రోడ్డుమీద నిలుపుదల వీటిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్లపై నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజగోపాల్, ఎస్సై టివిఆర్ సూరి, ఆర్ అండ్ బి ఏఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: