జూలూరుపాడు, నవంబర్ 2, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్ డైలీ వేస్ వర్కర్స్ గిరిజన అసోసియేషన్ పిలుపు మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమ్మె 5వ రోజుకి చేరింది. బుధవారం గ్రామ సర్పంచ్ కట్రం మోహనరావు, వార్డు సభ్యులు కాజా రమేష్ సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. హాస్టల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులర్ చేసి, వారికి నెల నెల జీతాలు చెల్లించాలని, సెలవులతో కూడిన వేతనాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బానోత్ రాజు, ధారావత్ శంకర్, సోలం వెంకటమ్మ, కల్తీ లక్ష్మి, జెర్పుల భద్రమ్మ, చుంచు రాధా, భూక్య శాంతి, బానోత్ తులసి, గుమ్మడి రాజేశ్వరి, జబ్బా రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: