CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యాలి : అగ్రికల్చర్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ మడకం సాధు

Share it:


మన్యం న్యూస్,అశ్వాపురం, అక్టోబర్ 2: అశ్వాపురం మండలం వెంకటాపురం పంచాయతీలోధాన్యం  కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యాలని ఆ ఆ పంచాయతీ సర్పంచ్ మడకం సాధు అగ్రికల్చర్ ఆఫీసర్ కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పంచాయతీ  రైతులు 100 ఎకరాలలో  వరి పంట పండిస్తున్నారు. గత సంవత్సరం పండించిన వరి  ధాన్యం తుమ్మల చెరువు పంచాయతీ కీ తరలించి ప్యాక్స్ ధాన్యం కొనుగులు కేంద్రానికి తరలించడం జరిగిందని ఈ క్రమంలో  రైతులకు రవాణా ఖర్చులు పెరిగి ఆర్థికంగా భారం పడిందని తెలిపారు.  వరి కొనుగోలు కేంద్రం తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా

 మండల వ్యవసాయ అధికారి శంభో శంకర్ మాట్లాడుతూ.. వెంకటాపురం పంచాయతీ రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం 5కిలోమీటర్లు దూరం ఉన్న విషయం తమ దృష్టికి రావడం జరిగిందని, జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: