సారపాక, నవంబర్ 2, మన్యం న్యూస్ :
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు ఎనలేని కృషి చేస్తున్నారని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కొనియాడారు. బుధవారం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అనునిత్యం ప్రజల కోసమే కార్యక్రమంలో భాగంగా పాత సారపాక ప్రాంతంలో జెడ్పిటిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించి అధికారులను సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రజల సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి, నిధులు విడుదల చేయించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యలు ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, తెరాసా మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, తెరాసా నాయకులు చుక్కపల్లి బాలాజీ, భూక్య చిరంజీవి, మూడ్ మణికంఠ, భుక్యా కృష్ణ, పంగి సురేష్, ప్రసాద్, సాయిబాబా, వీరయ్య, ఆంజనేయులు, అరుణ్ ప్రసాద్, నాగ్ రవి, బద్రు, ప్రేమ్, రాజేష్, మోహన్ రావు, నరసింహారావు, సురేష్, కర్రీ నాగేశ్వర్రావు, గ్రామపంచాయతీ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.
Post A Comment: