CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అలుపెరుగనిపోరాట యోధుడు కొమరం భీం

Share it:


మన్యం న్యూస్ మంగపేట, నవంబర్ 20

మంగపేట మండల కేంద్రం లో కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ విగ్రహం ఆవిష్కరణ ఆదివాసీ నాయకులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం లో కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ నాయకులు, ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, వివిధ గ్రామాల నుండి ఆదివాసీనాయకులు హాజరైనారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ కొమరం బీమ్ పోరాట స్ఫూర్తి తో ప్రజలు ముందుకు వెళ్లాలని సూచించారు. తెరాస జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ కొమరం భీమ్ అలుపెరుగనిపోరాటం ఆదివాసీ బిడ్డల కు వరప్రసాదం అతను చేసిన పోరాటం ఈ రోజు భూమి మీద ఆదివాసీలకు హక్కులు లభించాయని, అతని పోరాట స్ఫూర్తి ప్రతి ఆదివాసీబిడ్డ లో ఉండాలని పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవచ్చని తెలిపారు. పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్ మాట్లాడుతూ కొమరం భీమ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని అతని ఆశయాలు సాధించటానికి ఆదివాసీలు ఐక్యత గా ఉండాలని సూచించారు. శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ రమేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామం లో కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరణ చేయాలనీ అందుకు అందరూ కలసి రావాలని త్వరలో మంగపేట మండలం రాజుపేట గ్రామం లో కొమరం విగ్రహ ప్రతిస్థాపనకు సిద్ధం గా ఉన్నామని ఆ ఖర్చు మొత్తం శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ మొత్తం భరిస్తుందని దీనికి మీ అందరి సహకారం కావాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: