CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందులో పలుచోట్ల ఆనందోత్సాహాల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమాలు

Share it:


-పరివార సమేతంగా కర్తికవనబోజన వేడుకలు

 -కార్తీకమాసం చివరి ఆదివారం కావటం వల్ల ఎక్కువచొట్ల కార్యక్రమాలు 

- కార్యక్రమాలకు, ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ కోరం


మన్యం న్యూస్ ఇల్లందు,నవంబర్20:-  కార్తీక మాసం ముగియనున్న సందర్భంగా,  ఆదివారం రోజు ఇల్లందులో పలుచోట్ల వనభోజనం కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. మండల పరిధిలోని రొంపేడు వద్ద గల మామిడి తోట నందు ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో  వనభోజన కార్యక్రమం జరిగింది. జరిగినటువంటి ఈ రెండు కార్యక్రమాలకు కూడా

ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య.

రోపెడు మామిడి తోటలో ఏర్పాటుచేసిన వనభోజనం కార్యక్రమంలో కొరం ప్రసంగిస్తూ,వనభోజన కార్యక్రమం అనేది మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. పూర్వపు రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వనభోజన మహోత్సవాన్ని జరుపుకునేవారని,వేగంగా మారుతున్న కాలక్రమేనా నేడు  పట్టణాల్లో నివసించే వివిధ కులాల వారు  వారి కులస్తులను ఒక సమూహంగా ఏర్పరుచుకుని ఇలాంటి వేడుకలు నిర్వహించటం సంతోషకరమన్నారు.

ఈ కార్యక్రమంలో వారివెంట ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్,పాయం కృష్ణ ప్రసాద్,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ మూతి కృష్ణ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం, నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాసరావు,కుంటా రాజు, రావూరి సతీష్,అజ్జు,సతీష్, సాయి,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: