మన్యం న్యూస్ మంగపేట. నవంబర్ 20
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని మంగపేట సహకార సంఘం చైర్మన్ తోట రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని బుచ్చంపేట గ్రామంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయనతో పాటు బుచ్చంపేట సహకార సంఘం డైరెక్టర్ చిట్టిమల్ల రజితసమ్మయ్య లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడు రకం వడ్లకు , సి గ్రేడు రకం వడ్లకు మద్దతు ధర నిర్ణయించిందని అన్నారు.
Post A Comment: