* అదిలాబాద్ జిల్లాలో జరిగిన వాలీబాల్ పోటీల్లో గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభ
* ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించడంతోనే ఉత్తమ ఫలితాలు
*ప్రిన్సిపల్ హరికృష్ణ
మన్యం న్యూస్ గుండాల : ప్రభుత్వ జూనియర్ గురుకుల కళాశాల విద్యార్థులు అదిలాబాద్ జిల్లా లాల్ టేకేడి లో ఈనెల 12,13,14,15, తేదీలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ అండర్ 19 బాలుర విభాగాల్లో కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ ఘనపరిచి పథకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ హరికృష్ణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పథకాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహిస్తూ వారికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడంతో ఉత్తమ ఫలితాలు విద్యార్థులు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు షార్ట్ పుట్ లో కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. పుస్తకాలు సాధించిన విగ్నేష్ , శివ, విజయ్ లను ఘనంగా సన్మానించినట్లు ప్రిన్సిపాల్ హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, జి రమేష్ , అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: