మన్యం న్యూస్, చండ్రుగొండ, నవంబర్ 20: గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుంగారం పంచాయతీకి చెందిన బర్మావత్ సీత్య (60) వార్డు సభ్యునిగా ఉన్నాడు. గత మూడు పర్యాయాలు వరుసగా వార్డు మెంబర్ గా ఎన్నికవుతూ, టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటురావడంతో కొత్తగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు. మృతదేహాన్ని టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: