మన్యం న్యూస్, దమ్మపేట నవంబర్ 20 .. ఇటు వలె కాలంలో పెట్రోల్ బంకులలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి అలాంటి మోసం దమ్మపేట మండలం, దమ్మపేట లో గల సెంట్ మేరీస్ స్కూల్ ఎదురుగా ఉన్న మారుతి ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ నందు ఆదివారం వాహన దారుడురూ. 110 రూపాయలు పెట్రోల్ పోయించగా బండిలో పెట్రోల్ తక్కువ వచ్చిందేమో అని అనుమానం వచ్చి అక్కడే బండి ప్రక్కకు నిలిపి పెట్రోల్ ను బాటిల్లో బయటికి తీయగా అర లీటర్ పెట్రోల్ వచ్చింది వినియోగదారుడు పెట్రోల్ తక్కువగా వచ్చింది ఇదేమిటని ప్రశ్నించగా బంక్ వర్కర్ల వినియోగదారుడుపై దురుసుగా ప్రవర్తించారు. అలాగే బంకు వర్కర్లు మాపై చర్యలు తీసుకునే వారు ఎవరూ లేరు అంటూ వినియోగదారులపై బంకు వర్కర్లు దౌర్జన్యానికి దిగారు, గతంలో కూడా ఇలాంటి మోసాలు ఈ పెట్రోల్ బంకులో జరిగాయి ఇలాంటి మోసాలు జరగకుండా అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.
Navigation
Post A Comment: