మనం న్యూస్, పినపాక, నవంబర్ 20..
అక్రమంగా ఎవరైనా విద్యుత్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం విద్యుత్ శాఖ డి.ఈ జీవన్ కుమార్ అన్నారు. ఆదివారం పినపాక మండలంలోని జానంపేట, ఏడూళ్ళ బయ్యారం, పినపాక, దుగినేపల్లి,టి.కొత్తగూడెం.అమరారం, గ్రామలలో రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గృహ వినియోగదారుల బకాయిలు 72 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ బకాయిలను చెల్లించకుండా కొంత మంది వినియోగదారులు జాప్యం చేయడంతో,మణుగూరు సబ్ డివిజన్ అధికారులు ,ఏఈలు ,సబ్ ఇంజినీర్లు, సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.బకాయిలు ఉన్న ప్రతి గృహన్ని తనిఖీ చేశారు. బకాయిలు కట్టని గృహ కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా డిఈ జీవన్ కూమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూడ విద్యుత్ బకాయిలు లేకుండా,చూడాలని తెలిపారు. అక్రమ విద్యుత్ వాడకం చట్టరీత్యా నేరం అని, ఎవరైనా అక్రమ విద్యుత్ వాడితే చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో మణుగూరు, ఏఈ లు, వేణుగోపాల్, అశ్వాపురం ఏఈ శ్రీనివాస్, కరకగూడెం ఏఈ నరేందర్ రెడ్డి, ఏడూళ్ళ బయ్యారం ఏఈ కావ్య, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అంకిత, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: