CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: జడ్పీ సీఈవో ఆశాలత.

Share it:


మన్యం న్యూస్, పినపాక: 

పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈవో ఆశాలత అన్నారు. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని పినపాక గ్రామపంచాయతీ పరిధిలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పినపాక గ్రామంలో మానవహారంగా ఏర్పడి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అన్ని పంచాయతీల్లో 100% మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తడి , పొడి చెత్త సేకరించే విధంగా పంచాయతీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు వ్యక్తిగతంగా కూడా ఇళ్లలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపిఓ శ్రీనివాసరావు, పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: