CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ విగ్రహం ను ధ్వసం చేసిన బుర్ర రఘురెడ్డిని కఠినంగా శిక్షించాలి

Share it:


మన్యం న్యూస్, మంగపేట.:

  జోగులాంబ గద్వాల్ జిల్లా రేగులపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వసం చేసిన దుండగుడు బుర్ర రఘు రెడ్డి అనే వ్యక్తి నివెంటనే పోలీసులు అదుపులోనికి తీసుకొవాలి, అంబేద్కర్ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదవారికి అందరి వాడు, అంబేద్కర్ ఒక దళితులకే కాదు అంబేద్కర్ మన దేశ రాజ్యాంగ నిర్మాత, అటువంటి రాజ్యాంగం రాసిన నిర్మాత  విగ్రహాలకు రక్షణ లేకపోతే సామాన్య మానవులకు రక్షణ ఉంటుందా,అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే చాల మందికి విద్య, ఉద్యోగాల లబ్ది పొందుతున్నారు, రాజకీయాలల్లో కూడా లబ్ది పొందుతున్నారు, అలాంటి మహనీయులు ఐన  అంబేద్కర్ విగ్రహం ను ధ్వసం చేయాలనీ ఆలోచన రావడం కూడా నేరమే, దేశ ద్రోహం అవుతుంది, అటువంటి దేశ ద్రోహికి కఠినమైన శిక్ష వేయాలని దళిత నాయకులు కోరారు.పోలీస్ లు వెంటనే రఘు రెడ్డి ని అదుపులోనికి తీసుకొని ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు చేయాలనీ ఏమార్పియస్ నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వాలు రక్షణ కలిపించాలి అంబేద్కర్ విగ్రహాలు ధ్వసం చేస్తే వారికి ఉరి శిక్ష శిక్ష వేయాలి అని ఎమ్మార్పి ఎస్ మంగపేట మండల నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ, ఏమార్పియస్ సీనియర్ నాయకులు పాలమాకుల సోమనర్సయ్య మాదిగ,సిపిఎం నాయకులు ఎల్పి ముత్యాలు,జాడి రవి, దుర్గం ముత్తమ్మ, బొర్ర అంజయ్య, కొంగరి నరేష్, బొర్ర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: