మన్యం న్యూస్ ,భద్రాచలం:
గత రెండు రోజుల క్రితం సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది.ఈ సంఘటన యావత్తు రాష్ట్రాన్ని కుదిపివేసింది .ఈ నేపథ్యంలో గురుకులాలలో మరో మారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉదేశ్యం తో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి కి గురి కాకుండా ఆర్సిఓలు, ప్రిన్సిపల్ లకు సిబ్బందికి సూచన లు చేశారు. మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థి రోజువారి చర్యలు చర్యలను గమనించాలని పిల్లలని చదువుతోపాటు ఆటపాటల తద్వారా మానసికంగా కృంగిపోకుండా ఉత్సాహ పరిచాలని సూచించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం గురుకుల పాఠశాల కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాసు,ఆర్ సి ఓ డేవిడ్, కళాశాల అధ్యాపకులు రాంబాబు, వెంకటేశ్వర్లు, దేవుని బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: