- మినీ తిరుపతిగా...
- మారనున్న పాల్వంచ శ్రీనివాసగిరి గుట్ట
- రూ 12 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 03.... భక్తులకు కొంగుబంగారమై ఎంతో విశిష్టతను సంతరింపజేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్టకు మినీ తిరుపతిగా సరికొత్త శోభ రానున్నది. కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీనివాస్ గిరి గుట్ట అభివృద్ధి కొరకు రూ 12 కోట్ల రూపాయలను మంజూరు చేయడం భక్తుల్లో ఆనందం వెళ్లి విరిసింది . ప్రతి ఏడాది శ్రీనివాసగిరి గుట్టపై ఎంతో కళావైభవంగా సంస్కృతి సాంప్రదాయపద్ధంగా జరిపే శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు శ్రీనివాసగిరి గుట్టను సందర్శించుకుంటారు. కోరిన కోరికలు సిద్ధింప చేస్తూ భక్తుల పండుగ మహా దైవంగా వెలిసిన శ్రీనివాస్ గిరి గుట్ట అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం రెండు సిసి రోడ్లు, సైడ్ వాల్స్, సెంట్రల్ లైటింగ్ , డివైడర్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టి సరికొత్త హంగులతో భక్తుల సందర్శనార్థం మినీ తిరుపతిగా వైభవం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మనోభావాలకు అతీతంగా రూ 12 కోట్ల రూపాయలు మంజూరు చేయటం సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేత నిధులు మంజూరు చేయిండం పట్ల స్థానిక శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు చేసిన ప్రత్యేక కృషికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు
Post A Comment: