మన్యం న్యూస్, వాజేడు:
గత నాలుగు సంవత్సరాల క్రితం ఒక రహదారి ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా సచ్చుపడిపోయి, నడవలేని పరిస్థితిలో ఉన్న శ్యామల శ్రీకాంత్ కు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్, ఫ్యాన్, అందించారు. ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ, అధికారి శిడం సాయి. మాట్లాడుతూ కలకోట రామయ్య కీర్తిశేషులు వెంకటాపురం గ్రామం, వారి జ్ఞాపకార్థంగా కలకోట సంతోష్ కుమార్ ఆర్థిక సహాయంతో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాజేడు మండలం బొల్లారం గ్రామంలో శ్యామల, శ్రీకాంత్, పరిస్థితి తెలుసుకొని,ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పాయం రమణ, సర్పంచ్ సిడం యామిని, టిఆర్ఎస్ పార్టీ రైతు సంఘ అధ్యక్షులు సిడం ముత్తయ్య, నూగూరు సర్పంచ్ ఇండ్ల లలిత, వనపర్తి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: