మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 3::
ఏజెన్సీలో అందని వైద్యం అనే మన్యం న్యూస్ కథనానికి స్పందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ దయానంద్ గురువారం నాడు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఈ తరుణంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల వివరణ అడిగి తెలుసుకున్నారు అలానే ఆసుపత్రి లోని వివిధ విభాగాలను రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే వైద్య సేవలను విస్తురపరచాలని త్వరలోనే ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బర్త్ డే వెయిటింగ్ హాలు, రీజనల్ లాబరేటరీ మంజూరు చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆయన ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మరోమారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ బాలాజీ నాయక్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: