- ప్లాంటేషన్ లో మొక్కలు నరికిన పోడుదారులు...
- ఐదుగురుపై కేసు నమోదు...
- కొత్తగా పోడు నరికితే కఠిన చర్యలు...
- అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు...
మన్యం న్యూస్ చండ్రుగొండ నవంబర్ 3 : అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం రావికంపాడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ లో పోడుదారులు నరికిన మొక్కలను మండలస్థాయి ( రెవిన్యూ,పోలీస్ మండలపరిషత్) అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్లాంటేషన్ లో మొక్కలు నరికిన ఐదుగురి వ్యక్తులపై ఫారెస్ట్, పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇకపై కొత్త పోడు నరికితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు బంద్ చేయటం జరుగుతుందన్నారు. 2005 అటవీహక్కుల చట్టప్రకారం పోడుదారులందరికీ పట్టాలు వస్తాయని, అనవసరంగా మళ్ళీ ప్లాంటేషన్ లో మొక్కలు నరకవద్దని, ప్లాంటేషన్ మొక్కలు నరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రావికంపాడులో పోడుదారులు నరికిన ప్లాంటేషన్ మొక్కలకు గాను రూ 2.79 లక్షలు, మద్దుకూరులో రూ 1.34 లక్షలు నష్టపరిహారం పోడుదారుల నుండి వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇకపై ఒక్క మొక్క నరికిన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అన్నపూర్ణ, ఆర్ఐ ముత్తయ్య,పోలీస్ సిబ్బంది,ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ బానోత్ రన్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: