CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పైపు లైను పనులను చేపడతాం.. చేతిపంపును పరిశీలిస్తున్న ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఈ శ్రీనివాస్.. మన్యం న్యూస్ కథనానికి స్పందన..

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 7::

మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఐదు సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైప్ లైన్  సంబంధిత పనులను చేపట్టలేదని 'భగీరథ నీళ్లు లేవు చేతి పంపులో నీళ్ళు రావు ' అనే మన్యం న్యూస్ కథనానికి మిషన్ అధికారులు స్పందించారు. దీనిలో భాగంగా సోమవారం నాడు స్థానిక సర్పంచ్ జుంజురి లక్ష్మి  ప్రజా ప్రతినిధులతో కలిసి రామచంద్రపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మహిళలు వార్తాపత్రికల్లో ప్రచురితమైతే కానీ కనిపించరాని అధికారులను నిలదీశారు అనంతరం డి ఈ శ్రీనివాస్  మాట్లాడుతూ చేతి పంపు మరమ్మతులు చేపడుతామని అలానే మిషన్ భగీరథ పైప్ లైన్  పనులను చేపట్టడానికి వరి పొలం వేయడం వల్ల ఆటంకం కలుగుతుందని వరి కోతలు కోసిన తర్వాత పైపు లైన్  పనులను చేపడతామని అక్కడే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ &ఎస్  ఏఈ రాము, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జుంజురి జై సింహ, భగీరథ కార్మికుడు నికాస్, గ్రామస్తులు మంగరాజు, వరలక్ష్మి, సుజాత, వేణు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: