మన్యం న్యూస్, గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండలలో సోమవారం కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాలు కార్తీక శోభతో మారుమోగాయి. మహిళలు వేకువజావనే మేలుకొని స్నానం ఆచరించి దీపారాధనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండాల మండల కేంద్రంలోని రామాలయం, పడుకోని గూడెం గ్రామంలో కిన్నెరసాని నది ఒడ్డున రామాలయం, ఆళ్లపల్లి మండలంలోని రామాలయం తో పాటు ఇతర ఆలయాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి నది స్థానం ఆచరించి దీపారాధన చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు చేరుకొని దీపారాధన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.
Navigation
Post A Comment: