మన్యంన్యూస్, మణుగూరు: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శారీర దారుడ్య శిక్షణను అంకితభావం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని మణుగూరు జిఎం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పీవీ కాలనీ భద్రాద్రి నందు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకుని పోలీస్ శాఖల ఉద్యోగం సాధించాలని కన్నవారికి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం లలిత్ కుమార్, డీజీఎం (పర్సనల్) రమేష్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, గుర్తింపు సంఘం నాయకులు ప్రభాకర్ రావు, సంక్షేమ అధికారి నరేష్, స్పోర్ట్స్ అసిస్టెంట్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: