CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి...

Share it:


మన్యంన్యూస్, మణుగూరు:  ఈ నెల 12న మణుగూరు ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం  చేయాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్  వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు . రాజి పడదగిన పోలీస్ కేసులు, ప్రైవేట్ కేసులైన మనోవర్తి, గృహహింస, చెక్ బౌన్స్ కేసులలో ఉన్న కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో రాజీ కుదుర్చి కేసులను పరిష్కరించాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను  విజయవంతం చేసేందుకు బార్ అసోసియేషన్ న్యాయవాద సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు కుర్మ విజయ్ రావు, కందిమల్ల నరసింహారావు, రామ్మోహన్ రావు, పోశం భాస్కర్, నగేష్, చొక్కయ్య, శైలజ, కవిత, సరస్వతి, వాసవి, లావణ్య, సావిత్రి, సర్వేశ్వరరావు, అశోక్, బిక్కసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: