CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆగని హైటెక్ దోపిడి .... తస్మాత్ జాగ్రత్త...

Share it:


-బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం.

-రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు. .

-అమాయకులను టార్గెట్ చేస్తున్న వైనం.

మన్యం న్యూస్, మణుగూరు : కొత్తగా హైటెక్ దొంగలు రంగంలోకి దిగారు. బ్యాంక్ ఖాతాదారుల వివరాలు, ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు.  వీరి పని ఏమిటంటే వారి వద్ద ఉన్న మొబైల్ నంబర్లకు కొన్ని లింక్ లను పంపుతున్నారు. ఆ లింక్ లను ఓపెన్ చేసారో అంతే సంగతులు. వెంటనే మీ ఖాతాలో ఉన్న నగదు అంతా మాయం. పోలీస్ లు ఎన్ని సార్లు అవగాహన కల్పించినా సరే ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. మరి కొంత మంది ఏటీఎంల  వద్దకు వచ్చే అమాయకులను టార్గెట్ చేయడమే నండోయ్. చదువుకోని వారు ఏటీఎంలకు వచ్చి పోతుంటారు వారికి ఎం చేయాలో తెలియదు. మిషన్ ఆపరేటింగ్ రాదు . దీంతో పక్కన ఉన్న వారికి ఏటీఎం పిన్ నెంబర్ చెప్పి డబ్బులు డ్రా చేయమని చెబుతారు. ఇక అంతే సంగతులు డబ్బులు డ్రా చేస్తున్నట్లు నటించి ఏటీఎం పనిచేయడం లేదని చెప్పి వారి వద్ద ఉన్న పనిచేయని ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకేముంది కొద్ది సేపటి తర్వాత తమ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసినట్టు మొబైల్ కు మెసేజ్ రావడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్, బ్యాంక్ ల చుట్టూ పరుగులు పెడతారు. ఇది అక్షరాల నిజం అండి బాబు. ఇటీవల ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. కంప్యూటర్ కాలంలో కూడా అమాయక ప్రజలు నేరగాళ్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. ఆన్లైన్  మోసాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా  ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇలాంటి మోసాలు మరల జరుగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: