*టూరిస్టుల మాయలో పడి మోసపోవద్దు
*టీఆరెస్ పార్టీ మండలమైనార్టీ నాయకులు ఎండీఆదాం
మన్యం న్యూస్ గుండాల:ఉమ్మడి గుండాల రూపురేఖలు మార్చిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతరావుకే దక్కుతుంది అనిటీఆరెస్ పార్టీ మండలమైనార్టీ నాయకులు ఎండీఆదాం అన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తొలిసారి గెలిచిన సందర్భంలో,ఆలాగే రెండోసారి గెలిచిన నాటినుండి మారుమూల గుండాల మండలం పై ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రేగా తమ మండలానికి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తానని ఆదాం మన్యం న్యూస్ కి తెలిపారు. శనివారం ఆళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రేగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి అయినా ఆళ్లపల్లి మండల అభివృద్ధి అయిన ఒక రేగా కాంతారావు తోనే సాధ్యమవుతుందని మరో మారు రేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మండల ప్రజలపై ఉందన్నారు. టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారని వారి మాయలో పడి మోసపోవద్దని ఆయన కోరారు. సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలా? బినామీ గా వ్యవహరించే నాయకుడు కావాలా? అని మండల ప్రజలు, యువకులు మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Post A Comment: