మన్యం న్యూస్, మంగపేట, నవంబర్ 09: దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గుళ్ళ వెంకటయ్య తన అధ్యాపక బృందంతో పాటు సుమారు వందమంది విద్యార్థులతో కలిసి
బుధవారం వరంగల్ -2 డిపో మేనేజర్ సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సంధర్బంగా ప్రిన్సిపాల్ వెంకటయ్య మాట్లాడుతూ మండలంలోని శివారు గ్రామాలైన దోమెడ,బ్రహ్మణపల్లి,రాజుపేట, రమణక్కపేట,చుంచుపల్లి,మల్లూరు,తిమ్మంపేట,నర్సింహాసాగర్ వంటి గ్రామాల నుండి విద్యార్థులు కళాశాలలో చదువుకుంటున్నారని తెలిపారు.బస్సు సౌకర్యం లేకపోవడం చేత ఆటో చార్జీలు భారంగా మారి చాలా మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపివేస్తున్నారని కావున బస్సు కళాశాల సమయానికి ఉదయం గం.9:30 నిమిషాలకు కళాశాలకు చేరేవిధంగా తిరిగి సాయంత్రం గం. 4:30 నిమిషాలకు మంగపేట నుండి బయలుదేరే విధంగా విద్యార్థుల సౌకర్యార్థం బ్రహ్మణపల్లి నుండి కమలాపురం వరకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అనంతరం డిఎం. సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అంశాన్ని పరిశీలించి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు.
Post A Comment: