మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నవంబర్ 09: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ పంచాయతీలో బైపాస్ రోడ్డు సమీపంలో నలుగురు నడిచే దారిని ఇదేచ్ఛగా ఆక్రమించుకొని కట్టడానికి కడుతున్నారని పలువురు ఆరోపణ మేరకు పంచాయతీ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. బుధవారం మన్యం న్యూస్ దినపత్రికలో ప్రచురితమైన "యదేచ్చగా కబ్జా ఆపై దర్జా" అనే కథనానికి మంచి స్పందన లభించింది. బైపాస్ రోడ్డు సమీపంలో ప్రజలు నడిచేందుకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారిని కొందరు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న క్రమంలో ఆ రహదారి అక్రమాన్ని కొందరు అడ్డుకొని ప్రశ్నించారు . తాను అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి వద్ద కొన్నానని అందుకు సంబంధించిన కాగితాలు ఉన్నాయని సంబంధిత లబ్ధిదారుడు చెప్తున్నప్పటికీ గత కొన్ని ఆ పంచాయతీ పరిధిలో ప్రజలు నడిచేందుకు దారి అని ఎవరు ఆక్రమించరాదని ఎవరైనా పంచాయతీ నిబంధన ఉల్లంఘిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని గురువారం విద్యానగర్ కాలనీ పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు
Navigation
Post A Comment: