హైదరాబాద్ :
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు రెండు నెలలుగా రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు. ఇంటికి చేరుకున్న రాజాసింగ్ కు ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు
Post A Comment: