CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సానియా మీర్జా-షోయాబ్ మాలిక్....విడాకుల రూమర్లపై క్లారిటీ..

Share it:

 


విడాకులు తీసుకున్నారనే ఊహాగానాల మధ్య భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా -పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తొలిసారి కలిసి దర్శనమిచ్చారు.  వీరిద్దరూ కలిసి ఓ రియాల్టీ షోను హోస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. శనివారం OTT ప్లాట్‌ఫారమ్ ఉర్దుఫ్లిక్స్ ఈ మేరకు వీరిద్దరితో కలిసి ఓ కార్యక్రమం చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది. అందులో వారిద్దరూ క్లోజ్ గా ఉండి ఫొటోలకు ఫోజులిచ్చారు. 'ది మీర్జా -మాలిక్ టాక్ షో'ని ప్రకటించారు. 

పోస్టర్‌లో సానియా మరియు షోయబ్ ఇద్దరూ కలిసి ఈ షోను హోస్ట్ చేస్తున్నట్టు ఉంది.  'మీర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్‌లో మాత్రమే' అని ఉర్ధూ ఫ్లెక్స్ క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేసింది. ఈ ప్రకటన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ వచ్చేసింది. 'విడాకులు తీసుకున్నది పబ్లిసిటీ కోసమా?' అని ఒకరు కామెంట్ చేస్తే.. మరో అభిమాని 'పబ్లిసిటీ స్టంట్.. కావాలనే ఇలా చేశారు' అని కామెంట్ చేశారు.  మరికొందరు ఈ జంట విడిపోవడం లేదని సంతోషించారు. వారికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. 'దయచేసి ఎప్పటికీ విడిపోకండి. మీరు కలిసి అందంగా కనిపిస్తారు. అల్లా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ' మరో అభిమాని కామెంట్ చేశారు.  

ఇటీవల, ఆన్‌లైన్‌లో ఈ జంట విడాకుల కోసం వెళుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది..సానియా గతంలో దుబాయ్‌లోని పామ్ జుమేరాలోని ఒక ఇంట్లో షోయబ్‌తో కలిసి నివసించిన తర్వాత ఇటీవల దుబాయ్‌లోని కొత్త నివాసానికి మారారు. దీంతో ఈ విడాకుల వార్తలు జోరందుకున్నాయి.  వీరిద్దరూ విడిపోవడానికి ఇటీవల ఫొటోషూట్ కారణం. పాకిస్తాన్ హాట్ మోడల్ అయేషా తో షోయబ్ కలిసి ఉన్న ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. పాకిస్తానీ మోడల్ తో షోయాబ్ సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే సానియా విడాకులు తీసుకుందని వార్తలు వచ్చాయి. అయేషా మాత్రం షోయబ్‌ను తన స్నేహితుడిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా సానియా-షోయాబ్ కలిసి ఓటీటీ హోస్ట్ చేస్తుండడంతో వీరి విడాకులకు తెరపడింది.

Share it:

SPORTS

Post A Comment: