సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీనీ శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇక కుటుంబ సభ్యులు అయితే కన్నీరు అవుతున్నారు. ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో అసలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కుమారుడు రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో భార్య ఇందిరా దేవి మరణాలతో కృష్ణ ఎంతగానో కృంగిపోయారు. ఈ క్రమంలో నిన్న కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ కావటం జరిగింది.
అయితే హాస్పిటల్ కి చేరుకున్నే సరికి ఆయన ఆరోగ్యం విషమించడంతో… ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది. ఈ రీతిగా చికిత్స తీసుకుంటున్న కృష్ణ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలో ఆయన మరణానికి గల అసలు కారణాన్ని వైద్యులు వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ మరణించినట్లు డాక్టర్ ఎన్ రెడ్డి మీడియాకు తెలియజేయడం జరిగింది. గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక ఎమర్జెన్సీకి తరలించి సిపిఆర్ చేసినట్లు స్పష్టం చేశారు.
ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లు ఆసుపత్రికి వచ్చేసరికే కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు డాక్టర్ గురు ఏన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో రెండు మూడు గంటల తర్వాత చాలా వరకు అవయవాలు పనిచేయడం మానేసేయి. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం కావడంతో అది కూడా చేసినట్టు స్పష్టం చేశారు. అయితే నిన్న సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని… ఈ క్రమంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని గంటలు మనశ్శాంతితో వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి ట్రీట్మెంట్ ఆపేయడం జరిగింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచినట్లు మీడియాతో వైద్యులు పేర్కొన్నారు.
Post A Comment: