మన్యం న్యూస్, గుండాల, నవంబర్ (2) : యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో చెట్టు పల్లి గ్రామంలో యాదవ సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాదవ సంఘం నాయకులు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం శెట్టిపల్లి గ్రామంలోని యాదవ సంఘం నాయకులతో సమ్మేళనాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. గంగాలమ్మ తల్లి గుడి కడుతున్న నేపథ్యంలో దానికి సహకరించే విధంగా మేము ముందుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడలేని విధంగా యాదవులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, ఎస్సీ విభాగం నియోజకవర్గం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్, ఉపాధ్యక్షులు రమేష్ , అశ్వాపురం యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ , లోహిత్ యాదవ్, సైదులు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: