మన్యం న్యూస్, బూర్గంపాడు, అక్టోబర్ 2: మండల పరిధిలోని పోలవరం సమీపంలో గల జాతీయ రహదారికి అక్కడి రైతులు పంట భూముల కొరకు రోడ్డుకు అంతర్గతంగా. నిర్మించిన వాటర్ పైపు లైన్లు పగిలిపోయి రోడ్డు మీద నీరు చేరి ప్రమాద స్థాయిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై. కొందరు ప్రాణాలు కోల్పోగా. మరికొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వాళ్లనే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి అధికారులు తూతూ మంత్రంగా మరమతులు చేపట్టి చేతులు దులిపేసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి మరమత్తులు నిర్వహించి వాటర్ లీక్ కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే మళ్లీ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
Navigation
Post A Comment: