స్థాయికి మించి ఆర్ ఎం పీ వైద్యం
- ఆర్ ఎం పీ పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితులు
- డిప్యూటీ డీఈఎంఓఫిరాజ్ ఆధ్వర్యంలో విచారణ
మన్యం న్యూస్, బూర్గంపాడు : మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆర్ ఎం పి వైద్యుడు లక్ష్మీ నారాయణ అర్హత లేకపోయినా స్థాయికి మించిన వైద్యం చేయడం, అధిక ఫీజులు వసూలు చేయడం పై ఇదే మండలం జింకలగూడెంకు చెందిన వ్యక్తి సోమవారం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు. దీనితో బుధవారం డిప్యూటీ డీఈఎంఓ ఫిరాజ్ ఆధ్వర్యంలో క్లినిక్ ని తనిఖీ చేసి జిల్లా వైద్య అధికారి దయానంద స్వామి కి నివేదిక సమర్పించారు. ఆర్ ఎం పీ వైద్యుడు లక్ష్మీ నారాయణ స్థాయికి మించి వైద్యం చేయడం, అధిక మోతాదు కలిగిన యాంటీ బయటిక్స్ వాడటం, ఆక్సిడెంట్, పురుగు మందుల కేసుల కు వైద్యం చేయడాన్ని అధికారులు గుర్తించారు. పూర్తి నివేదికను సమర్పించి అనంతరం గ్రామీణ వైద్యుని పై చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. పరిధికి మించి ఆర్ఎంపీలు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డిఐఎం ఓ ఫిరాజ్ హెచ్చరించారు. హెచ్.ఈవిజయ్ కుమార్, స్థానిక వైద్యురాలు స్పందన,హెచ్ఇఓ రవి తదితరులు పాల్గొన్నారు.
.
Post A Comment: