మన్యం న్యూస్,మణుగూరు టౌన్:
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో మణుగూరు సీఐ ముత్యం రమేష్ మణుగూరు పట్టణంలో గల అన్ని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్, ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు,కళశాలల ప్రిన్సిపల్స్ తో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ హాస్టల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని, సమస్యలు తలెత్తినవెంటనే పోలీస్ శాఖకి సమాచారం అందించాలి కోరారు.పోలీస్ శాఖ ఆయా హాస్టళ్లచుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల, వసతి గృహాల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: