మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన విలేకరి కొప్పుల సంపత్ కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆయన దశదిన కర్మల నిమిత్తం టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి లు సంపత్ కుటుంబానికి ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను అందించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూపా నాగభూషణం, సంపత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: