మన్యం న్యూస్, మణుగూరు: మండలంలోని అంగన్ వాడి కేంద్రాల్లో గర్భిణీలకు, పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందజేయాలని మణుగూరు జడ్పిటీసి పోశం నర్సింహారావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు మున్సిపాలిటీలో అన్నారం గ్రామం లోని అంగన్ వాడి కేంద్రాన్నీ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాలకు వచ్చే వారికి సరైన ఆహారాన్ని ఖచ్చితంగా అందజేయాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే వారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు జావీద్ పాషా, టీఅర్ఎస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: