మన్యం న్యూస్ , దుమ్ముగూడెం , నవంబర్ 7::
మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో కొదుమూరి శైలజ జ్ఞాపకార్థం 200 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సొసైటీ నాయకులు మెట్ల పాపయ్య మాట్లాడుతూ ఆదివాసులకు అన్నివేళలా అండగా ఉంటూ ఆదివాసీల ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తున్న కొదుమూరి కుటుంబానికి ఆదర్శ సొసైటీ తరఫున కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసం వసంతరావు రిటైర్డ్ డిటిడిఓ, వెంకటేశ్వర్లు ఈ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అర్జున్, సీమల సూర్యనారాయణ, రాజు, పాఠశాల ప్రత్యేక అధికారిని శోభారాణి, దుమ్ముగూడెం ప్రధానోపాధ్యాయులు అపక శంకరు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: