మన్యం న్యూస్ ,ములకపల్లి :
మండలం లో సిపిఐఎంఎల్ ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులొ భాగంగా అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి పార్టీ మండల కార్యదర్శి కల్లూరు కిషోర్ అధ్యక్షత వహించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులు నుపా భాస్కర్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ...అమర యోధులందరి పోరాటాల జ్ఞాపకాలను,త్యాగాలను,చరిత్రను గుర్తు చేసుకోవడానికి నవంబర్ 1 నుండి 7 తేదీ వరకు జరుగుతున్న అమరవీరుల సభలను ప్రతి గ్రామాలలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుగంచి లక్ష్మణ్,తిమ్మంపేట ఎంపీటీసీ నూప సరోజిని,పాత గంగారం ఎంపీటీసీ మడకం విజయ, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ కార్యదర్శి కొర్స రామకృష్ణ.పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు బండారు నాగేంద్రబాబు.మండల కమిటీ సభ్యులు ఎర్ర గొర్ల రామారావు,నకిరికంటి నగేష్ రావు,శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు, పెద్దం లక్ష్మణరావు, మడల గ్రామల కార్యదర్శులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: