మన్యం న్యూస్, ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం ముందు గత 11 రోజులుగా ఆదివాసి మహిళ
సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్తు కొనసాగించే దీక్షలకు మద్దతుగా పోడుదెబ్బ సంఘం నాయకులు వచ్చి పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించడం జరిగింది.
గత11 రోజులుగాజరుగుతున్న రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి,ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూక నాగేశ్వరరావు మాట్లాడుతూ 11 రోజులకి రిలే నిరాహార దీక్షలు పూర్తికావస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది దీనికి ఆంతర్యం ఏమిటని ఆయన మండిపడ్డారు.ఏజెన్సీలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకే పూర్తి హక్కు ఉన్నది అన్నారు.కానీ ఏటూరు నాగారం ప్రభుత్వ 50 పడకల ఆస్పత్రిలో గిరిజనేతరులని ఎలా నియమించారని వారు ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలని జీవో నెంబర్ 68 చెప్తుందని వారన్నారు.కానీ అధికారుల మాత్రం చట్టానికి విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడి గిరిజనేతర్లకి ఉద్యోగ అవకాశాలు కనిపించడం సరైన పద్ధతి కాదన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజనేతర్లని మైదాన ప్రాంతాలకు వెళ్ళగొట్టాలని అన్నారు.మన జాతిని ముందుకు తీసుకెళ్లాలంటే ఆదివాసి మహిళలు ఆదివాసి యువకులు ఆదివాసి నిరుద్యోగులు అందరూ ఐక్య పోరాటలకి సిద్ధం కావాలని అన్నారు.గిరిజనేతల్ని తొలగించేంతవరకు రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో పొడ్ దెబ్బ నాయకులు బొల్లం సారయ్య,ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ మూలుగు జిల్లా అధ్యక్షులు
బొదే బోయిన సురేష్,ఏటూరు నాగారం మండల అధ్యక్షురాలు పాయం భారతి, ఉపాధ్యక్షురాలు సోలం అరుణకుమారి,ప్రధాన కార్యదర్శి యాలం రామలక్ష్మి, కొప్పుల సరిత,బండ రమ్య, రమ,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: