మన్యం న్యూస్, ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కొమురం భీం మినీ స్టేడియంలో గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన బాల,బాలికల క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈనెల 28 నుండి 30 వరకు భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో జరుగు ఇంటర్ సొసైటీ క్రీడలకు మలుగు జిల్లా నుండి వివిధ క్రీడల్లో 26 మందిని ఎంపిక చేయడం జరిగిందని,వీరికి ఈ నెల 27 వరకు కిన్నెరసాని లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని,ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ పోచం విద్యార్థులతో మాట్లాడుతూ. త్వరలో జరగబోవు క్రీడలకు ఇప్పటినుండే క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, మంచి ప్రతిభ కనబరిచి మన ఐటీడీఏకు మంచి పేరు తీసుకురావాలని,సోమవారం క్రీడలకు ఎంపికైన విద్యార్థులను క్యాంపుకు పంపించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారులు యాలం ఆదినారాయణ,శ్యామలత, పీడీలు తోలెం సమ్మయ్య,గడ్డం లక్ష్మీనారాయణ,బిజ్జ సునీత, చింత రమేష్,చింత సతీష్ పాల్గొన్నారు.
Post A Comment: